ఆస్తంతా అభిమాన నటుడికి రాసిచ్చి.. | Sanjay Dutt rejects Mumbai fan money | Sakshi
Sakshi News home page

ఆస్తంతా అభిమాన నటుడికి రాసిచ్చి..

Mar 7 2018 2:17 PM | Updated on Mar 7 2018 2:17 PM

Sanjay Dutt rejects Mumbai fan money - Sakshi

సంజయ్‌ దత్‌ ఫైల్‌ ఫోటో(ఇన్‌ సెట్‌లో అభిమాని నిషి హరిష్‌ చంద్ర త్రిపాఠి)

ముంబై : సినిమా స్టార్‌లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా అభిమానులు వెనకాడరు. ఆ హీరో సినిమా విడుదలైనప్పుడు కటౌట్లు పెట్టడం, వాటికి పాలాభిషేకం చేయడం, మొదటి రోజు మొదటి షో చూసేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు అభిమానులు. అయితే ముంబైకి చెందిన నిషి హరిష్‌ చంద్ర త్రిపాఠి(62) అనే  అభిమాని మాత్రం ఏకంగా తన ఆస్తిని హీరో సంజయ్‌ దత్‌ పేరిట రాసి తనువు చాలించింది. జనవరి 15న అనారోగ్యంతో ఆమె కన్నుమూసింది. అయితే ఆమె చనిపోవడానికి కొన్ని నెలల ముందే తన ఆస్తంతా సంజయ్‌ దత్‌కు చెందేలా వీలునామా రాశారు. పాలీ హిల్స్‌లోని సంజయ్‌ దత్‌ అడ్రస్‌ను కూడా వీలునామాలో పేర్కొన్నారు. నిషి కుటుంబసభ్యులకు కూడా బ్యాంకు అధికారులు చెప్పే వరకు వీలునామా విషయం తెలియకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

 
వీరాభిమాని ఎంతో ప్రేమతో తన పేరిట రాసిన ఆస్తిని సంజయ్‌ దత్‌ సున్నితంగా తిరస్కరించి, రియల్‌ హీరోగా నిరూపించుకున్నారు. సదరు ఆస్తి మొత్తం నిషి కుటుంబ సభ్యులకే చెందేలా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడాలని సంజయ్‌ తన తరఫు లాయర్‌కు సూచించారు. ‘ అభిమానంతో కొందరు తమ పిల్లలకు మా పేర్లు పెడుతుంటారు. మరికొందరైతే మా వాహనాలను వెంబడించి మరీ కానుకలు ఇవ్వాలని చూస్తుంటారు. ఇలా ఓ అభిమాని ఆస్తిమొత్తం రాయడం మాత్రం నన్ను షాక్‌కు గురిచేసింది. నిషి నా పేరిట రాసిన ఆస్తులన్నీ ఆమె కుటుంబీకులకే చెందాలి. ఇందుకోసం లీగల్‌గా నావంతు సాయం చేస్తా’ అని  సంజయ్‌ దత్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement