నటుడు ధనుష్తో కలిసి నటించాలని ఆశగా ఉందని అంటున్నారు నటి రితిక సింగ్. ముంబైకి చెందిన ఈ బాక్సింగ్ భామ రాను, రాను అంటూనే సినీ రంగ ప్రవేశం చేసి ఇరుదుచుట్రు (చివరి రౌండ్) అంటూ తొలి చిత్రంతోనే పెద్ద విజయాన్ని పొందడంతో పాటు జాతీయ అవార్డును అందుకున్నారు. ఇక తమిళంతో పాటు తెలుగులోనూ అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతికి జంటగా ఆండవన్ కట్టళై చిత్రంలో నటిస్తున్నారు. కాక్కాముట్టై చిత్రం ఫేమ్ మణికంఠన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది.
ఈ సందర్భంగా రితిక సింగ్ను పలకరిస్తే బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. అవేమిటో ఆ సుందరి మాటల్లోనే...ఆండవన్ కట్టళై చిత్రంలో మహిళా రిపోర్టర్గా నటిస్తున్నాను. ఈ పాత్ర కోసం పలు ఛానళ్లను చూసి రిపోర్టర్ల నడవడికలను క్షుణ్ణంగా గమనించాను. ఇప్పుడు నాకు ప్రశ్నలను అడగడం తెలిసింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన సింధును ఇంటర్వ్యూ చేయాలన్న కోరిక కలుగుతోంది. అయితే ఇంకా తమిళ భాష మాట్లాడటం రాలేదు. ఇతరులు మాట్లాడింది అర్థం చేసుకోగలుగుతున్నాను. షూటింగ్లో నాకొక శిక్షకుడు ఉన్నారు.
త్వరలోనే తమిళ భాషను నేర్చుకుంటాను. తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు లభించడం అదృష్టంగానే భావిస్తున్నాను. ఇకపై ఎలాంటి పాత్ర అయినా బాగా నటించాలన్న బాధ్యత పెరిగింది. తమిళంలో నటుడు ధనుష్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని ఆశగా ఉంది. జ్యోతిక నా అభిమాన నటి. ఆమె నటన నాకు బాగా నచ్చుతుంది.
తమిళ ప్రేక్షకులంటే చాలా గౌరవం. నన్ను ఒక్క చిత్రంతోనే ఎంతగానో అభినందిస్తున్నారు. ముఖంపై గాయాలయితే నటనకు ఇబ్బంది అవుతుందని బాక్సింగ్ క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదు. ఆండవన్ కట్టళై చిత్రంలో నటించడానికి ఆ చిత్ర హీరో విజయ్ సేతుపతి చాలా సహకరించారు. తదుపరి పీ.వాసు దర్శకత్వంలో లారెన్స్కు జంటగా నటిస్తున్నాను. తెలుగులో వెంకటేష్తో కలిసి నటిస్తున్నాను అని ముచ్చటించారు.
ధనుష్తో జత కట్టాలని ఆశ
Published Tue, Sep 20 2016 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
సీఎం సభకు సర్వం సిద్ధం
రాజకీయ లబ్ధి కోసం మోదీ యూ టర్న్
సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు : డీఎస్పీ
తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం
పొలంలో ధాన్యం రాశుల దగ్ధం
మిత్ర పురుగులతో తెల్లదోమ నివారణ
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement