Sye Raa Narasimha Reddy Release Date, Announced by Ram Charan at VVR Promotion - Sakshi
Sakshi News home page

Jan 8 2019 3:22 PM | Updated on Jan 8 2019 4:52 PM

Ram Charan Announce Chiranjeevi Sye Raa Release Date - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎందిరించిన మొట్ట మొదటి తెలుగు నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తల్లి కోరిక మేరకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ భారీ బడ్జెట్‌తో తన తండ్రికి కానుకగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో సైరా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు ఓ అప్‌డేట్ ఇచ్చాడు చరణ్‌. వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చరణ్‌, సైరాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, తమన్నా, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement