‘2.ఓ’ మళ్లీ వాయిదా..?

Rajinikanths 2o release postponed again - Sakshi

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీచిత్రం 2.ఓ. కోలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో ఘనవిజయం సాధించిన రోబోకు కొనసాగింపుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే అయితే ఏప్రిల్ 13నే సినిమా రిలీజ్ ఉంటుందన్న టాక్ వినిపించింది.

ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించినా.. నిర్మాణాంతర కార్యక్రమాలు మరింత సమయం పడుతుండటంతో వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న సెండకోళై 2 (తెలుగులో పందెంకోడి సినిమాకు సీక్వల్) రిలీజ్ డేట్‌ను ప్రకటించటంతో 2.ఓ రిలీజ్ పై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

విశాల్ హీరోగా తెరకెక్కిన ఇరుంబుతురై (అభిమన్యుడు) సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో మాట్లాడిన విశాల్ తన తదుపరి చిత్రం సెండకోళై 2ను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. దీంతో ఏప్రిల్ 13న 2.ఓ రిలీజ్ లేదని ఫిక్స్ అవుతున్నారు చిత్రవర్గాలు. అంతేకాదు ఏప్రిల్ 27న 2.ఓ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఏప్రిల్ నెలాఖరునైనా రోబో థియేటర్లలో సందడి చేస్తుందేమో చూడాలి. రజనీకాంత్, అమీజాక్సన్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top