అతన్ని చూస్తే ఈర్ష్యగా ఉంది: రాజమౌళి

Rajamouli Said He Felt Jealous About Nag Ashwin - Sakshi

‘మహానటి’.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ఈ సినిమా విడుదలైన రోజునుంచే మంచి వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ దూసుకుపోతుంది. ‘మహానటి’ ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, హీరో అల్లు అర్జున్‌ చిత్ర యూనిట్‌కు ప్రత్యేక విందును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విందుకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో పాటు మహానటి చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత స్వప్న దత్‌, ప్రియాంక దత్‌, కీర్తి సురేష్‌, విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి హాజరైన జక్కన్న నాగ్‌ అశ్విన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాగ్‌ అశ్విన్‌ను చూస్తే తనకు చాలా ఈర్ష్యగా ఉందన్నారు.  నాగ్‌ అశ్విన్‌ చాలా గొప్ప దర్శకుడని, ‘మహానటి’ని తెరకెక్కించిన విధానం చూస్తే ఎవరైన ఆ విషయాన్ని ఒప్పుకుంటారని అన్నారు. ఈ చిత్రంలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకుంటూ, తాను నాగ్‌ అశ్విన్‌ అంత ఈజ్‌తో అలాంటి సన్నివేశాలను తీయలేనని నిజాయితీ ఒప్పుకున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ‘మహానటి’ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top