ఇద్దరు ప్రముఖ కథానాయికల జీవితాల ఆధారంగా హిందీలో రెండు సంచలన చిత్రాలు రూపొందనున్నాయి. ఒకటేమో-ఒకప్పటి అగ్రకథానాయిక సుచిత్రాసేన్ జీవిత కథ కాగా, మరొకటి - బాలీవుడ్ నంబర్వన్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా లైఫ్ స్టోరీ.సుచిత్రా సేన్ హిందీలో ఎంత పాపులరో, బెంగాలీలో అంత కన్నా పాపులర్. ‘దేవదాస్’ లాంటి ఎన్నో కళాఖండాల్లో నటించిన సుచిత్ర ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా అందుకున్నారు. సినిమాలు నటించడం మానేశాక మూడు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపిన ఈ మహానటి మొన్న జనవరిలో కోల్కతాలో కన్ను మూశారు. ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో కూడిన ఆమె జీవితాన్ని తెరకెక్కించాలని అభిజిత్ చౌదురి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
సుచిత్రాసేన్ను కలిసి చూచాయగా కథ కూడా వివరించారట. ఇప్పుడీ ఈ కథను ఆమె మనవరాలు రైమా సేన్తో తెరకెక్కిస్తున్నారు. రైమా సేన్ అంటే తెలుగులో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ధైర్యం’ చిత్రంలో కథానాయిక. నటి మూన్మూన్ సేన్ కూతురు. సుచిత్రాసేన్కి స్వయానా మనవరాలు. తెలుగులో ‘ధైర్యం’లో హీరోయిన్గా చేసిన అమ్మాయి. అమ్మమ్మ పాత్రను చేయడానికి రైమా తొలుత భయపడిందట. కానీ దర్శకుడు బలవంతంగా ఒప్పించారు. అందుకే రైమా తన అమ్మమ్మ నటించిన సినిమాలన్నీ చూస్తూ ఆ అభినయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హిందీ, బెంగాలీల్లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘నాయిక’ అని పేరు పెట్టారు. ఆగస్టు నుంచి షూటింగ్.
ఇక ప్రియాంకా చోప్రా విషయానికొస్తే తను ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి చేరుకున్నారు. అందం కన్నా అభినయాన్నే నమ్ముకున్న ప్రియాంక జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. అవి ఆమె సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఆమెకు తొలి రోజుల ప్రియుడు అశీమ్ మర్చంట్, ప్రియాంక కథతో సినిమా నిర్మించనున్నారు. ‘67 రోజులు’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా పాత్రకు సాక్షి చౌదరిని ఎంపికచేశారు. ఈ సాక్షి తెలుగులో ఇటీవల ‘పోటు గాడు’ సినిమాలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రియాంక ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. చూద్దాం ఏమవుతుందో!
తెరకెక్కుతున్న తారల జీవితాలు
Published Wed, May 7 2014 10:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement