ప్రయాణం మొదలైంది | Parineeti Chopra Starts Shooting for The Girl on the Train movie shooting | Sakshi
Sakshi News home page

ప్రయాణం మొదలైంది

Aug 6 2019 2:49 AM | Updated on Aug 6 2019 2:49 AM

Parineeti Chopra Starts Shooting for The Girl on the Train movie shooting - Sakshi

పరిణీతి చోప్రా

కథానాయిక పరిణీతి చోప్రా రైలు ప్రయాణం చేస్తున్నారు. అదితీరావ్‌ హైదరీ, కృతీకల్హారీ ఈ ప్రయాణంలో పరిణీతి చోప్రాకు తోటి ప్రయాణికులు. ఈ ముగ్గురు హీరోయిన్లు కలిసి ఏ ట్రైన్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేయలేదు. ‘ద గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ అనే హాలీవుడ్‌ సినిమా హిందీ రీమేక్‌ మూవీ కోసం తోటి ప్రయాణికులుగా తోడయ్యారు. రిబు దాస్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. మేజర్‌ షూటింగ్‌ లండన్‌లో ప్లాన్‌ చేశారు. ఓ మిస్సింగ్‌ పర్సన్‌ కేసులో చిక్కుకున్న ఓ వివాహిత ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుంది. పౌలా హాకిన్స్‌ ఫేమస్‌ నవల ‘ద గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ ఆధారంగా అదే టైటిల్‌తో 2015లో ‘ద గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement