
వలపులో మలుపు!
నవీన్ చంద్ర, ఆర్తీ చిక్కర జంటగా వేణుమూవీస్ పతాకంపై పసుపులేటి వేణుమాధవ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.గోపీ దర్శకుడు.
నవీన్ చంద్ర, ఆర్తీ చిక్కర జంటగా వేణుమూవీస్ పతాకంపై పసుపులేటి వేణుమాధవ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.గోపీ దర్శకుడు. శనివారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి కరంటం రాంబాబు కెమేరా స్విచాన్ చేయగా, టీవీ నరసింహారెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఓ యువకుడి ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది? హ్యాపీగా, రొమాంటిక్గా సాగుతున్న జీవితంలో యాక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అనేది ఆసక్తికరం. ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: హరి, కెమేరా: వాసు, సంగీతం: కార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.శ్రీనివాస్, సహ నిర్మాత: వి.కావేరి.