ఉత్కంఠకు గురి చేసేలా... | Nandamuri Tarakaratna Yamini Sekhar, Chandu | Sakshi
Sakshi News home page

ఉత్కంఠకు గురి చేసేలా...

Aug 18 2016 11:18 PM | Updated on Sep 4 2017 9:50 AM

ఉత్కంఠకు గురి చేసేలా...

ఉత్కంఠకు గురి చేసేలా...

టాలీవుడ్‌లో ఇప్పుడు హారర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా ‘ఎవరు’ పేరుతో మరో హారర్ చిత్రం తెరకెక్కింది. తారకరత్న,

టాలీవుడ్‌లో ఇప్పుడు హారర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా ‘ఎవరు’ పేరుతో మరో హారర్  చిత్రం తెరకెక్కింది. తారకరత్న, శేఖర్, యామిని, చందు ప్రధాన పాత్రల్లో రమణ సెల్వ దర్శకత్వంలో ముప్పా అంకమ్మ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకరులతో మాట్లా డారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో నారా రోహిత్ మాట్లాడుతూ-‘‘సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

వరుసగా హారర్ చిత్రాలు వచ్చి విజయం సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే అంశాలు చాలా ఉంటాయి’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత ఓ మంచి చిత్రం చేశాననే ఫీలింగ్ కలిగింది’’ అని తారకరత్న చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: లింగ శ్రీనివాసరావు.

Advertisement
 
Advertisement
Advertisement