5న మగళీర్‌ మట్టుం | Mangalyar Mattam is coming to the screen on September 15. | Sakshi
Sakshi News home page

5న మగళీర్‌ మట్టుం

Aug 19 2017 1:21 AM | Updated on Sep 17 2017 5:40 PM

5న మగళీర్‌ మట్టుం

5న మగళీర్‌ మట్టుం

జ్యోతిక ప్రధానపాత్రలో నటిస్తున్న మగళీర్‌ మట్టుం సెప్టెంబర్‌ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

తమిళసినిమా:  జ్యోతిక ప్రధానపాత్రలో నటిస్తున్న మగళీర్‌ మట్టుం సెప్టెంబర్‌ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.  వివాహానంతరం జ్యోతిక చేస్తున్న రెండో చిత్రమిది. మగళీర్‌ మట్టుం. ఇంతకు ముందు ఈమె నటించిన 36 వయదినిలే చిత్రం మంచి విజయాన్ని సాధించింది. 

ఈ సినిమాలో జ్యోతికతో పాటు భానుప్రియ, ఊర్వశి, శరణ్యపొన్‌వన్నన్‌లు నటిస్తుండడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, లివింగస్టన్‌ తదితరులు నటించగా, అతిథిగా సూర్య మెరవనున్నారు.సూర్య తన నిర్మాణసంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కుట్రం కడిదల్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన బ్రహ్మ కథ, దర్శకత్వం వహించారు. జిబ్రాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై  అంచనాలు ఎక్కువగానే  ఉన్నాయి.

జూలైలోనే ఈ  చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉన్నా, అనివార్యకారణాలతో ఆలస్యమైంది. దీంతో చిత్రాన్ని సెప్టెంబర్‌ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం తరువాత సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై తన తమ్ముడు కార్తీ హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరో పక్క తాను విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న తానాసేర్న్‌దకూటం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement