తిరువనంతపురం : మంచి సినిమాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన కేరళ నటి అన్నా రాజన్ ఒక్కసారిగా ఇరకాటంలో పడిపోయారు. ఓ టీవీ షోలో జోక్గా చేసిన కామెంట్లతో, అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. చివరికి వారి ఆగ్రహానికి దిగి వచ్చిన అన్నా రాజన్, కన్నీరుమున్నీరవుతూ ఫేస్బుక్ లైవ్లో మెగాస్టార్ మమ్ముటీకి క్షమాపణలు చెప్పారు. అసలేం జరిగిందంటే.. దుల్కర్ సల్మాన్, మమ్మూటీలతో కలిసి నటించడానికి ఇష్టపడతారా? అని అన్నా రాజన్ను ఓ మలయాళం ఛానల్ తన టీవీ షోలో ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు తాను, దుల్కర్ను హీరోగా ఇష్టపడతానని, మమ్మూటీ తనకు ఆన్-స్క్రీన్ తండ్రి పాత్ర పోషిస్తారంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు మమ్మూటీ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహానికి, అన్నా రాజన్ క్షమాపణలు చెప్పారు.
'' దీన్ని నేను జోక్గా తీసుకున్నా. నా కామెంట్ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది మీడియా వాళ్లు నా కామెంట్ను తప్పుదోవ పట్టిస్తారనుకోలేదు. మమ్మూటీని, దుల్కర్ను నేను అవమానపరచలేదు. ఇంత గొప్ప నటుడును అవమానపరిచే ఉద్దేశం నాకు లేదు. ఒకవేళ నేను అన్న మాటలు ఏమన్నా బాధ కలిగించి ఉంటే, మమ్మూటీ, దుల్కర్ అభిమానులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. మమ్మూటీ, దుల్కర్ ఇద్దరు సినిమాల్లో నాకు నటించాలని ఉంది. మమ్మూటీతో జతకట్టడానికి కూడా నేను సిద్ధమే'' అని రాజన్ ఫేస్బుక్ లైవ్లో చెప్పారు. అన్నా రాజన్ మలయాళంలో నటించిన రెండు మూవీలకు మంచి రివ్యూలు వచ్చాయి. తన తాజా సినిమా వెలిపాడింటె పుస్తకం. ఈ సినిమాలో సూపర్ స్టార్ మోహన్లాల్కు భార్యగా నటించారు.
కన్నీరుమున్నీరవుతూ మెగాస్టార్కు నటి క్షమాపణలు
Published Tue, Sep 26 2017 7:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement