‘మహానటి ’ షూటింగ్‌ షురూ | ‘Mahanati’ savitri biopic regular shooting starts | Sakshi
Sakshi News home page

‘మహానటి ’ షూటింగ్‌ షురూ

May 29 2017 2:15 PM | Updated on Sep 5 2017 12:17 PM

‘మహానటి ’ షూటింగ్‌ షురూ

‘మహానటి ’ షూటింగ్‌ షురూ

వెండితెర ధ్రువతార , మహానటి సావిత్రి బయోపిక్ ఎట్టకేలకు సెట్స్‌మీదకు రానుంది.

హైదరాబాద్‌: వెండితెర ధ్రువతార , మహానటి సావిత్రి  బయోపిక్ ఎట్టకేలకు సెట్స్‌మీదకు రానుంది.   నాగ్‌ అశ్విన దర్శకత్వంలో  ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం  లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ రామ‌కృష్ణ స్టూడియోలో  పూజాకార్యక్రమాలు  నిర్వహించింది.   నాగ్ అశ్విన్  ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు అధికారంగా లాంచ్  అయింది. తొలి షాట్ ని లెజండ‌రీ  నటుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్రి ఫోటోల‌పై  తొలిషాట్‌ను చిత్రీకరించారు.  త్వరలోనే సెట్స్‌మీదకువెళ్లనున్నట్టుచిత్ర  యూనిట్‌ ప్రకటించింది.

తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనున్నారు. ఇక సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో  టాలీవుడ్‌  బ్యూటీ సమంత  అలరించనుంది.  మరోవైపు  సీనియర్ నటి భానుప్రియ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర పోషించనుందని, ప్రస్తుతానికి ఆ పాత్ర వివరాలు సీక్రెట్ అంటున్నాడు నాగ్ అశ్విన్.

సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.  ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్.  మహిళా దినోత్సవం రోజు మహానటి సావిత్రి బయోపిక్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement