మరో బయోపిక్‌లో..? | Mahanati actress Keerthy Suresh in Vijaya Nirmala biopic | Sakshi
Sakshi News home page

మరో బయోపిక్‌లో..?

Apr 26 2020 12:40 AM | Updated on Apr 27 2020 1:12 PM

Mahanati actress Keerthy Suresh in Vijaya Nirmala biopic - Sakshi

అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించి, అందరి మెప్పు పొందారు కథానాయిక కీర్తీ సురేష్‌. ‘మహానటి’లో కీర్తి నటనకు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్‌ మరో బయోపిక్‌లో నటించనున్నారన్నది ఫిల్మ్‌నగర్‌ లేటెస్ట్‌ టాక్‌. సూపర్‌స్టార్‌ కృష్ణ భార్య, ప్రముఖ నటి, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించిన విజయ నిర్మల బయోపిక్‌ తెరకెక్కనుందట. ఇందులో విజయ నిర్మల పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించారట. మరి మరో బయోపిక్‌లో కీర్తి కనబడతారా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement
 
Advertisement
Advertisement