'దక్షిణ భారత కోకిల'కు ప్రతిష్టాత్మక అవార్డ్ | KS Chithra got keralas Harivarasanam Award | Sakshi
Sakshi News home page

'దక్షిణ భారత కోకిల'కు ప్రతిష్టాత్మక అవార్డ్

Dec 28 2017 11:20 PM | Updated on Dec 28 2017 11:20 PM

KS Chithra got keralas Harivarasanam Award - Sakshi

ప్రముఖ గాయని కె.ఎస్. చిత్రకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కనుంది. కేరళ ప్రభుత్వం ఏటా అందజేసే ‘హరివరాసనమ్‌’ పురస్కారానికి ఈ ఏడాది చిత్రని ఎంపిక చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి 14న శబరిమల దేవస్థానంలో వైభవంగా జరగనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని చిత్రకి అందజేయనున్నారు. పురస్కారంలో భాగంగా రూ. లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని గాయని అందుకోనున్నారు. మధురమైన తన స్వరంతో పాటలు పాడుతూ.. అందరిలో లౌకిక స్ఫూర్తిని పెంపొందిస్తున్నందుకే చిత్రకి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక పురస్కారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘దక్షిణ భారత నైటింగేల్‌’ అని బిరుదందుకున్న సింగర్ చిత్ర మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సినిమాలకు గాత్రదానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement