ఫిదా అయ్యారు | KK Radhamohan Speech At Pantham Movie Success Meet | Sakshi
Sakshi News home page

ఫిదా అయ్యారు

Jul 14 2018 4:32 AM | Updated on Jul 14 2018 4:32 AM

KK Radhamohan Speech At Pantham Movie Success Meet - Sakshi

గోపీచంద్, మెహరీన్‌

గోపీచంద్, మెహరీన్‌ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ‘‘గ్రాండ్‌ సక్సెస్‌ సాధించి రెండో వారంలోకి అడుగు పెట్టింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారి కెరీర్‌లో 25వ చిత్రం ‘పంతం’ మాబ్యానర్‌లో నిర్మించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఆయనకి ఎంత ముఖ్యమో నాకు అవగాహన ఉండటంతో మేకింగ్‌లో రాజీ పడలేదు.

మెసేజ్‌ ఓరియంటెడ్‌ కమర్షియల్‌ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. చక్రవర్తి కొత్తవాడైనా క్లారిటీతో అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలోని గ్రాండ్‌నెస్‌ ఆడియన్స్‌ని మెప్పించింది. కోర్టు సన్నివేశంలో గోపీచంద్‌గారు ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘పంతం’ గోపీచంద్‌గారి కెరీర్‌లోనే హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. అన్ని ఏరియాల్లో సూపర్‌ కలెక్షన్స్‌తో రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఇంతటి సక్సెస్‌కి కారణమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, తిరుగులేని విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement