జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!? | Janhvi Kapoor Missing At Maidaan Mahurat Ceremony | Sakshi
Sakshi News home page

జాన్వీ లేకుండానే.. 'మైదాన్‌' ముహుర్తం

Aug 22 2019 7:22 PM | Updated on Aug 22 2019 7:49 PM

Janhvi Kapoor Missing At Maidaan Mahurat Ceremony - Sakshi

ముంబై: బోనీ కపూర్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'మైదాన్'. ఫుట్‌బాల్‌ కథాంశం నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌, ‘మహానటి’ ఫేమ్‌ కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ముంబైలో మంగళవారం ప్రారంభమైంది. అయితే, ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభ వేడుకకు బోనీ కపూర్ కుటుంబం సహా చిత్ర యూనిట్‌ అంతా హాజరయ్యారు. ​కానీ, బోనీ కపూర్‌-శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ మాత్రం కనిపించలేదు. 

ఈ సినిమా పూజ కార్యక్రమంలో బోనీ కపూర్ తన పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా, ఖుషీతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఈ వేడుకకు జాన్వీ కపూర్‌ ఎందుకు హాజరుకాలేదన్న దానిపై వివరాలు తెలియదు. ‘ధడక్‌’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్‌ కారణంగా ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఆమె రాలేకపోయారా? అన్నది తెలియదు. ఇక 1952 - 62 మధ్యకాలంలో భారత ఫుట్‌బాల్ క్రీడా వైభవాన్ని చాటేలా తెరకెక్కుతున్న ‘మైదాన్‌’లో అజయ్ దేవ్‌గణ్‌ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషిస్తుండగా, కీర్తి సురేష్ మరో కీలక పాత్రలో నటించబోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement