
భజన గీతాలు పాడుతున్న హేమ!
అలనాటి బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ హేమామాలిని (67) సింగర్ అవతారమెత్తారు.
తనలో ఇన్ని రోజులు దాగి ఉన్న మరో కొత్త కోణాన్ని ఈ ఆల్బం ద్వారా ఆవిష్కరిస్తున్నట్టు హేమ ఆనందంగా తెలిపారు. పండిట్ జైస్ రాజ్ సంగీత సారధ్యంలో నారాయణ అగర్వాల్ రచించిన భజన గీతాలను ఆల్బంగా రూపొందిస్తున్నట్టు చెప్పారు. దీన్ని అందరూ ఆదరించాలని కోరారు. గాయనిగా మారడం, పాటలు పాడటం ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఈ సరికొత్త అవతారాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు.