యమ జోరు

gopichand new movie with sampath nandi - Sakshi

హీరో గోపీచంద్‌ యమ జోరు మీద ఉన్నారు. వెంట వెంటనే సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు. ఇటీవలే బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకడిగా పరిచయమవుతున్న సినిమాలో హీరోగా నటించనున్నట్లు తెలియజేసిన గోపీచంద్‌ తాజాగా మరో కొత్త సినిమాకు సై అన్నారు. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు.

గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 28వ చిత్రం. ‘‘హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. మరో వైపు గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’ ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు తిరు దర్శకుడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top