ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిది: చిరంజీవి | chiranjeevi pays tribute to Ahuti Prasad | Sakshi
Sakshi News home page

ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిది: చిరంజీవి

Jan 5 2015 10:43 AM | Updated on Aug 28 2018 4:30 PM

ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిది: చిరంజీవి - Sakshi

ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిది: చిరంజీవి

కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి సోమవారం ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

హైదరాబాద్ :  కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి సోమవారం ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి  నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ఆహుతి ప్రసాద్ విలక్షణ నటుడని, ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. చిన్న వయసులోనే ఆహుతి ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిదన్నారు.

ఆహుతి ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నఆహుతి ప్రసాద్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement