ఒకే వేదికపై అల్లు అర్జున్, ప్రభాస్
టాలీవుడ్లోని యంగ్ హీరోలందరూ అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఎలాంటి భేషజాలకు పోకుండా మన హీరోలందరూ కలిసి మెలిసి ఉంటారు. ఏదైనా ఒక హీరో ఇంట్లో ఈవెంట్ జరిగితే.. మిగతా హీరోలు ప్రత్యక్షమవుతుంటారు. తాజాగా గోపీచంద్ ఇంట్లో జరిగిన ఓ ఈవెంట్కు ప్రభాస్, అల్లు అర్జున్లు హాజరయ్యారు.
గోపీచంద్.. తన కుమారుడు వియాన్స్ మొదటి పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. ఈ వేడుకలకు యంగ్రెబల్స్టార్ ప్రభాస్, స్టైలీష్స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు, రామ్, తేజ, బోయపాటి శ్రీను, సంపత్ నంది, వంశీ పైడిపల్లి తదితర ప్రముఖులు హాజరయ్యారు. గోపీచంద్ ప్రస్తుతం చాణక్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
మరిన్ని వార్తలు