
సాక్షి, ముంబయి : ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ గోల్ఫ్ క్రీడాకారుడిగానూ రాణిస్తున్నాడు. మెర్సిడెస్ ట్రోఫీ గోల్ఫ్ మీట్ నేషనల్స్కు మాధవన్ క్వాలిఫై అయ్యాడు. ఏప్రిల్ 4-6 తేదీల్లో పూణే ఆక్స్ఫర్డ్ గోల్ప్ రిసార్ట్లో జరిగే జాతీయ ఫైనల్స్లో మాధవన్ పోటీ పడనున్నాడు.
గోల్ఫ్ నేషనల్ ఫైనల్స్లో పాల్గొనేందుకు తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని మాధవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఫైనల్స్కు జరిగిన ఎంపికలో మాధవన్ 69.6 స్కోర్ సాధించి సత్తా చాటారు. నేటి ఫలితాల్లో 78 స్కోర్తో రోహన్ నిగం బెస్ట్ గ్రాస్ విన్నర్గా నిలిచాడు.