‘తెలంగాణలో బస్తీ దవాఖానాలు’ | Telangana govt to set up basti dawakhanas | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో బస్తీ దవాఖానాలు’

Jan 9 2018 8:38 PM | Updated on Jan 9 2018 8:38 PM

Telangana govt to set up basti dawakhanas - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను విస్తరిస్తామని వైద్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. మొట్టమొదట హైదరాబాద్ లో 50 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తామని, ఈనెలలో పాతబస్తీలో 4 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని చెప్పారు. బస్తీ దవాఖానాల కోసం డాక్టర్ల నియామకం చేపడతామని, కొత్తగా 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్ అథారిటీ స‌మావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆహార భద్రతకు సంబంధించి కీలక అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. ఇక నుంచి హోటళ్లు, ‌ఆహార పరిశ్రమలకు గ్రేడింగ్ ఇస్తామని.. స్టార్ హోటళ్లతరహాలో వర్గీకరిస్తామని చెప్పారు. సిద్ధిపేట-మహబూబ్‌నగర్, నల్గొండ-సూర్యాపేటలో జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని జేపీ నడ్డాను కోరినట్టు వెల్లడించారు. బీబీ నగర్‌ ఎయిమ్స్‌, జిల్లా ఆస్పత్రులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement