స్కూలుకు ఇలా... | World wonders... | Sakshi
Sakshi News home page

స్కూలుకు ఇలా...

Sep 6 2013 6:37 AM | Updated on Sep 2 2018 4:03 PM

చూడ్డానికి వరద బాధితుడిలా కనిపిస్తున్న ఇతడి పేరు అబ్దుల్ మాలిక్(40). అబ్దుల్ మాలిక్ ఓ టీచర్! మరి ఇదేంటి అని ప్రశ్నిస్తే.. రోజూ ఈయన పాఠశాలకు వెళ్లేది ఇలాగే..! కే

స్కూలుకు ఇలా...
 చూడ్డానికి వరద బాధితుడిలా కనిపిస్తున్న ఇతడి పేరు అబ్దుల్ మాలిక్(40). అబ్దుల్ మాలిక్ ఓ టీచర్! మరి ఇదేంటి అని ప్రశ్నిస్తే.. రోజూ ఈయన పాఠశాలకు వెళ్లేది ఇలాగే..! కేరళలోని మలప్పురం జిల్లాలోని ఓ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాలిక్ గత 20 ఏళ్లుగా ఇలా టైర్ ట్యూబేసుకుని.. ఓ చేతిలో టిఫిన్ బాక్సు, బట్టలు పట్టుకుని ఈ నదిని దాటుతూనే ఉన్నారు. ‘ఇది దగ్గరి దారి.. బస్సులో నేను పనిచేసే స్కూలుకు వెళ్లినా.. గంటల సమయం పడుతుంది. లేటైపోతుంది. విద్యార్థులు ఇబ్బందులు పడతారు’ అని మాలిక్ తెలిపారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం నాడూ ఇదే సీన్.. 15 నిమిషాల్లో నదిని దాటేసిన మాలిక్.. వెంటనే బట్టలు వేసేసుకుని.. చిన్నపాటి కొండ ఎక్కి.. 10 నిమిషాల్లో స్కూలుకు చేరుకున్నారు. మాలి క్‌ను చూడగానే పిల్లలంతా చుట్టుముట్టేసి.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దయ్యాక ఏమవుతావురా అని ఓ జర్నలిస్ట్ జహంగీర్ అనే విద్యార్థిని అడిగితే.. మాలిక్ సార్‌లాగా టీచర్‌నవుతా అని చెప్పాడు. అది విన్న మాలిక్ సార్ కళ్లలో మెరుపు. ఇన్నేళ్లుగా ఆయన కష్టాలను మరిపిస్తోంది.. ఆ మెరుపే..
 
 100 వాహనాలు ఢీ
 అడుగు దూరంలో అసలేం కనపడనంతటి దట్టమైన పొగ మంచు కారణంగా గురువారం ఇంగ్లాండ్‌లోని కెంట్ కౌంటీలోని రహదారిపై దాదాపు 100 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 200 వుంది గాయూలపాలయ్యారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఇంతటి ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కెంట్ కౌంటీలోని నాలుగు లేన్ల షెప్పీ రహదారిలో ఉదయం సమయంలో వంతెన వద్ద దట్టమైన పొగమంచు నిండిఉంది. దీంతో రోడ్డు కనిపించక ఆ రహదారిలో వెళ్తున్న కార్లు, లారీలు, రవాణా వాహనాలు మొత్తం ఒకదానికిమరోటి గుద్దుకొని ధ్వంసమయ్యాయి. ఉదయం సమయంలో వాహనాలు లైట్లు ఆర్పేసి వెళ్లడం సైతం ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు.
 
 ఉల్లి @ రూ. 9
 ఇది ఒక ఉల్లిపాయ రేటు కాదు.. కిలోదే! ఏ రైతు బజార్లో అని అడ్రస్సులు వెతికేయకండి.. ఇంత డెడ్‌చీప్‌గా ఇచ్చేస్తోంది ఓ ఆన్‌లైన్ బజార్లో.. గ్రూప్‌ఆన్ అనే షాపింగ్ వెబ్‌సైట్ ఈ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. స్థానిక హోటళ్లలోని డిస్కౌంట్లు, సేవలు వంటివాటిల్లో రాయితీలను అందించే ఈ సైట్ ఢిల్లీకి చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారితో కలిసి ఈ డీల్‌ను అందిస్తోంది. గురువారం నుంచి ఏడురోజులపాటు ఇది అందుబాటులో ఉంటుంది. రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు డీల్ ప్రారంభమవుతుంది. రోజుకు 3 వేల కిలోల ఉల్లిపాయలను విక్రయిస్తారు. స్టాకు ముగియగానే ఆ రోజుకు డీల్ ముగిసిపోతుంది. ఉచితంగా కొరియర్ ద్వారా హోం డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. మనం బుక్ చేసిన 10 రోజుల్లోగా డెలివరీ అందుతుంది. దేశంలోని 78 పట్టణాలకు చెందినవారికి ఈ డీల్ ప్రత్యేకం. కిలో మాత్రమే ఇస్తారు. వీటి కొనుగోలు కోసం ఈ సైట్‌లో యూజర్‌గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.9 కిలో ఉల్లిపాయలు మీకూ కావాలంటే.. www.groupon.co.inకు వెళ్లండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement