జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ను ఉగ్రవాదిగా ప్రకటించడంతో భద్రతామండలి అనుసరిస్తున్న తీరును భారత్ గర్హించింది.
ఐరాస తీరుపై భారత్ ఆగ్రహం
న్యూయార్క్: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ను ఉగ్రవాదిగా ప్రకటించడంతో భద్రతామండలి అనుసరిస్తున్న తీరును భారత్ గర్హించింది. ఐక్యరాజ్యసమితిలో సోమవారం జరిగిన సదస్సులో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడారు. మసూద్ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిందని..దీనిపై మండలి 9 నెలలు సమయం తీసుకుందన్నారు. కాగా, భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదనను పాకిస్తాన్ వ్యతిరేకించింది.