భారత్‌కు పెరిగిన యూఎస్‌ వీసాలు | Trump effect? 40% fall in US visas for Pakistanis, 28% rise for Indians | Sakshi
Sakshi News home page

భారత్‌కు పెరిగిన యూఎస్‌ వీసాలు

May 30 2017 1:03 AM | Updated on Apr 4 2019 3:25 PM

భారత్‌కు పెరిగిన యూఎస్‌ వీసాలు - Sakshi

భారత్‌కు పెరిగిన యూఎస్‌ వీసాలు

ట్రంప్‌ ప్రభుత్వం వచ్చాక భారత్‌కు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల జారీ పెరిగింది. తాజాగా విడుదల చేసిన అధికారిక సమాచారంలో..

పాక్‌కు భారీ కోత
ఇస్లామాబాద్‌: ట్రంప్‌ ప్రభుత్వం వచ్చాక భారత్‌కు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల జారీ పెరిగింది. తాజాగా విడుదల చేసిన అధికారిక సమాచారంలో.. భారత జాతీయులకు వీసాల్లో 28 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు అమెరికా విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ దేశాల్లో పాకిస్తాన్‌ లేకపోయినా ఆ దేశీయులకు వీసాల్లో మాత్రం భారీ కోత పెట్టారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌లతో పోలిస్తే ఈ ఏడాది అవే నెలల్లో నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల్లో పాక్‌ జాతీయులకు 40 శాతం తగ్గించారు.

ఈ వివరాలను పాక్‌ మీడియా సోమవారం వెల్లడించింది. గతేడాది ఒబామా పాలనలో పాక్‌ జాతీయులకు 78,637 వీసాలు జారీ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే నెలకు సరాసరి 6,553 వీసాలు. అయితే ఈ ఏడాది మార్చిలో 3,973, ఏప్రిల్‌లో 3,925 వీసాలు జారీ చేశారు. ఇక భారతీయులకు ఒబామా సర్కార్‌ గతేడాది 8,64,987 వీసాలు జారీచేసింది.

ఆ ఏడాదిలో సరాసరి నెలకు 72,082 వీసాలు. కాగా, ఈ ఏడాది మార్చిలో భారత జాతీయులకు 87,049, ఏప్రిల్‌లో 97,925 వీసాలు ట్రంప్‌ ప్రభుత్వం జారీ చేసింది. అయితే మొత్తంగా చూస్తే పాకిస్తానే కాకుండా ముస్లిం దేశాలకు వీసాల జారీల్లో అమెరికా భారీ కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏప్రిల్‌ నెలలో 20 శాతం వీసాలు తగ్గించారు. ఇక ట్రావెల్‌ బ్యాన్‌ ఎదుర్కొంటున్న ఇరాన్, సిరియా, సూడాన్, సోమాలియా, లిబియా, యెమెన్‌ దేశాలకు జారీ చేసిన వీసాల్లో 55 శాతం తగ్గుదల కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement