ఆర్మీ యూనిఫాంలో స్కూల్లోకి వచ్చిన ఉగ్రవాదులు | Terrorists Entered Pakistan School in Uniforms | Sakshi
Sakshi News home page

ఆర్మీ యూనిఫాంలో స్కూల్లోకి వచ్చిన ఉగ్రవాదులు

Dec 16 2014 3:12 PM | Updated on Sep 2 2017 6:16 PM

పాకిస్థాన్లోని పెషావర్ ఆర్మీ స్కూల్లోకి ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కరాచీ: పాకిస్థాన్లోని పెషావర్ ఆర్మీ స్కూల్లోకి ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శ్మశాన వాటిక నుంచి ఆరుగురు ఉగ్రవాదులు స్కూలు వెనుక గేటు ద్వారా ప్రవేశించినట్టు చెప్పారు. ఉగ్రవాదులు స్కూల్లోకి ప్రవేశించిన వెంటనే ఓ వాహనానికి నిప్పు పెట్టారు. అనంతరం విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. ఈ దుర్ఘటనలో వందమందికి పైగా విద్యార్థులు మరణించిగా, మరో 80 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో టీచర్లు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

ఉగ్రవాదులు స్కూల్లోకి ప్రవేశించినపుడు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఓ టీచర్ చెప్పారు.  ఉగ్రవాదులు అరగంట పాటు కాల్పులు జరిపిన అనంతరం సైన్యం పాఠశాల చుట్టుముట్టినట్టు తెలిపారు. సైన్యం స్కూల్లో నుంచి విద్యార్థులను తరలిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement