ఆఫ్ఘన్లో భూకంపం : 17 మందికి గాయాలు | Strong 6.2 magnitude quake rocks northeast Afghanistan: USGS | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘన్లో భూకంపం : 17 మందికి గాయాలు

Dec 26 2015 6:17 AM | Updated on Sep 3 2017 2:37 PM

ఆఫ్ఘన్లో భూకంపం : 17 మందికి గాయాలు

ఆఫ్ఘన్లో భూకంపం : 17 మందికి గాయాలు

ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్లోని పాకిస్థాన్ - కజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది.

కాబూల్ : ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్లోని పాకిస్థాన్ - కజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదు అయింది. ఈ భూకంప ప్రమాదంలో 17 మంది ప్రజలు గాయపడ్డారని యూఎస్ జియోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. భూమి కంపించడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని పేర్కొంది.

రాత్రంతా భయకరమైన చలిలో రోడ్లపైనే ప్రజలు జాగారం చేశారని వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని 203 కిలోమీటర్ల దూరంలో కనుగోన్నట్లు తెలిపింది. ఈ భూకంప ప్రభావం భారత్లో కనిపించింది. భారత్లోని హిమాలయా పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలతోపాటు న్యూఢిల్లీలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే  చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement