భయంతో.. యూఎన్‌కు..!? | Pakistan PM attend UN Assembly | Sakshi
Sakshi News home page

భయంతో.. యూఎన్‌కు..!?

Sep 16 2017 2:30 PM | Updated on Sep 19 2017 4:39 PM

భయంతో.. యూఎన్‌కు..!?

భయంతో.. యూఎన్‌కు..!?

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సమావేశాల్లో పాల్గొంటారని పాక్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సమావేశాల్లో పాల్గొంటారని పాక్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్‌ ప్రధానిగా తొలిసారి న్యూయార్క్‌ వెళ్లనున్నా ఆయన.. అక్కడ ప్రపంచ దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశామవుతారని ఆదేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. సమితి నుద్దేశించి పాక్‌ ప్రధాని చేసే ప్రసంగంలో కశ్మీర్‌తో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో భారత్‌-అమెరికా, భారత్‌-జపాన్‌ల బంధం బలోపేతం కావడం, రక్షణ, సాంకేతిక, అణు రంగాల్లో భారత్‌ ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక బంధాలను పెంచుకోవడంతో పాక్‌ కలవరపాటుకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాధినేతలతో పాక్‌ ప్రధాని సమావేశం కావాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సమితిలో పాక్‌ ప్రధానికి చైనా పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని తెలుస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement