భారత్‌ ప్రాజెక్టుపై పాక్‌ అభ్యంతరం

Pakistan Oppose Kishanganga Project - Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌- పాకిస్తాన్‌ మధ్య వివాదాస్పద కిృష్ణగంగా హైడ్రాలిక్‌ ప్రాజెక్టుని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్‌ ఈ హైడ్రాలిక్‌ ప్రాజెక్టుని ప్రారంభించడంపై పాక్‌ బహిరంగంగా విమర్శిస్తోంది. కశ్మీర్‌లో భారత్‌ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై పాక్‌ ఎప్పటినుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్‌ జలాల ఒప్పందంలోని వివాదాలను పరిష్కరించకుండా ప్రాజెక్టును ఏలా ప్రారంభిస్తారని పాక్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై పాక్‌ విదేశాంగ శాఖ శనివారం ఓ లేఖని విడుదల చేసింది.

కశ్మీర్‌లోని బందీపూర్ జిల్లాలో కిృష్ణగంగా నదిపై ‌330 మెగావాట్ల సామర్థ్యంతో కిృష్ణగంగా హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్టుకు 2007లో భారత్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్‌ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇండస్‌ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని పాక్‌ చేస్తోన్న ఆరోపణలను భారత్‌ ఖండించింది. ఒప్పందంలోని అంశాలకు లోబడే ఈ ప్రాజెక్టుని నిర్మించినట్లు భారత్‌ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top