క్షమాభిక్షపై తేలేవరకూ ఉరి తీయం | Pak on Jadhav's case | Sakshi
Sakshi News home page

క్షమాభిక్షపై తేలేవరకూ ఉరి తీయం

Jun 2 2017 2:46 AM | Updated on Mar 23 2019 7:58 PM

భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ను ఉరి తీస్తున్నారన్న వార్తలపై పాకిస్తాన్‌ స్పందించింది.

జాధవ్‌ వ్యవహారంపై పాక్‌ 
 
ఇస్లామాబాద్‌: భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ను ఉరి తీస్తున్నారన్న వార్తలపై పాకిస్తాన్‌ స్పందించింది. జాధవ్‌ క్షమాభిక్ష అభ్యర్థనలపై నిర్ణయం తీసుకొనే వరకూ అతడిని ఉరితీసేది లేదని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్‌ జకీరియా గురువారం స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వ అండతో అక్కడి మీడియా... అంతర్జాతీయ కోర్టులో కేసు గెలిచే లక్ష్యంతో పాక్‌పై దుష్ప్రచారం చేస్తోందన్నారు. అతడి క్షమాభిక్ష అభ్యర్థనలు ప్రస్తుతం పాక్‌ అధ్యక్షుడు, ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ వద్ద పరిశీలనకు ఉన్నాయ న్నారు. వీటిపై నిర్ణయం తీసుకొనేవరకూ జాధవ్‌ జీవించే ఉంటాడన్నారు. దీనిపై అవగాహన లేకుండా ఇరుదేశాల ప్రజల ను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement