భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య | Indian origin man kills wife, two daughters, self | Sakshi
Sakshi News home page

భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య

Oct 29 2014 8:51 AM | Updated on Jul 29 2019 5:43 PM

భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య - Sakshi

భార్యతోపాటు కూతుళ్లను చంపి ఆత్మహత్య

ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ ఎన్నారై తన భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను చంపేశాడు.

లండన్:  ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ ఎన్నారై తన భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను చంపేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లండన్లోని బ్రాడ్ఫోర్డ్లో చోటు చేసుకుంది. ఎన్నారై జితేంద్ర లాడ్ (49) తన భార్య దుష్కా లాడ్ (44) ఇద్దరు టీనేజీ కుమార్తెలు త్రిషా (19), నిషా (17)లతో కలసి బ్రాడ్ఫోర్డ్ నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి జితేంద్ర ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇరుగుపోరుగు వారు వెస్ట్ యార్క్షైర్ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు జితేంద్ర నివాసానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జితేంద్ర ఇంత దారుణానికి పాల్పడటానికి గల కారణాలు అన్వేషించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం నివేదిక వస్తే కానీ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు వెల్లడించారు.  కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇరుగుపోరుగు వారిని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement