భార్యా కూతుళ్లను చంపి ఆత్మహత్య | Four killed in suspect death at london | Sakshi
Sakshi News home page

భార్యా కూతుళ్లను చంపి ఆత్మహత్య

May 15 2015 12:50 AM | Updated on Jul 27 2018 2:18 PM

బ్రిటన్‌లో భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు.

లండన్: బ్రిటన్‌లో భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. తూర్పు లండన్‌లోని ఓ ఇంట్లో షిఘీ రితేశ్‌కుమార్(37) అనే మహిళ, ఆమె కవల కూతుర్లు నియ(13), నేహ(13)లు అనుమానాస్పద రీతిలో మరణించగా, వారి మృతదేహాలను పోలీసులు మంగళవారం గుర్తించారు.

షిఘీ భర్త రితేశ్‌కుమార్ పుల్లార్‌కటిల్(44) కోసం పోలీసులు గాలించగా, సమీపంలోని ఓ రిజర్వాయర్ వద్ద ఉరివేసుకుని మరణించిన స్థితిలో ఆయనను బుధవారం కనుగొన్నారు. అయితే, భార్య, కూతుళ్లను హత్య చేసిన రితేశ్‌కుమార్ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కేరళలోని రితేశ్ బంధువులకు సమాచారం చేరవేసి, సంప్రదింపులు సాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement