భారతదేశానికి చెందిన ఒక పరిశోధనా సంస్థ చేసిన పరీక్షలు అంత నమ్మశక్యంగా లేవని యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థ తేల్చేసింది. ఈ సంస్థ పరిశీలించిన దాదాపు 300 జెనెరిక్ డ్రగ్ అనుమతులు, డ్రగ్ అప్లికేషన్లను సస్పెండ్ చేయాలని సూచించింది. భారతదేశానికి చెందిన మైక్రో థెరప్యుటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ సంస్థకు ఇది అపప్రథగా నిలిచింది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఈ విషయాన్ని తన వెబ్సైట్లో పేర్కొంది. ఇటీవలి కాలంలో తరచు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్న భారత ఔషధ పరీక్షల పరిశ్రమకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు.
2016 ఫిబ్రవరి నెలలో ఇదే సంస్థ (మైక్రో థెరప్యుటిక్ రీసెర్చ్ ల్యాబ్స్) గురించి ఆస్ట్రియా, డచ్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో అసలు వీళ్లు అనుసరిస్తున్న ఔషధ ప్రయోగాల పద్ధతులు ఎంతవరకు సరిగ్గా ఉన్నాయనే అంశంపై యూరోపియన్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. పరిశోధన ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని సరిగా అన్వయించకపోవడం, డాక్యుమెంటేషన్ మరియు సమాచార విషయాల్లో లోపాలను ఇప్పటికే గుర్తించినట్లు ఈఎంఏ తెలిపింది. అయితే ఈ మందుల వల్ల ఏవైనా దుష్ప్రభావాలు వచ్చినట్లు గానీ, అవి పనిచేయకపోవడం గురించి గానీ ఇంతవరకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. మైక్రో థెరప్యుటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ సంస్థ పరిశీలించిన ఔషధాల మీద సస్పెన్షన్ అంశాన్ని యూరోపియన్ కమిషన్కు పంపుతారు. అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారు. భారతదేశానికి చెందిన పలు కాంట్రాక్టు పరిశోధన సంస్థలలో (సీఆర్ఓ) ఔషధ ప్రయోగాలు, పరీక్షలు నిర్వహిస్తారు. జెనెరిక్ ఔషధాల అనుమతులకు సంబంధించి ఈ పరీక్షలు చేయడం తప్పనిసరి. దేశంలోనే అతిపెద్ద సీఆర్ఓ అయిన జీవీకే బయో సైన్సెస్ చేసిన దాదాపు 700 మందులకు సంబంధించిన ఔషధ ప్రయోగాలను 2015లో నిషేధించింది. మిగిలిన చిన్న చిన్న భారతీయ సీఆర్ఓలు కూడా తగిన ప్రమాణాలు పాటించడంలో కొంతవరకు వెనకబడే ఉన్నాయని యూరోపియన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
భారతీయ ఔషధ ప్రయోగాలపై యూరప్ అసంతృప్తి
Published Sat, Mar 25 2017 8:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement