నైజీరియాలో 19 మంది భారతీయుల విడుదల

19 Indians kidnapped by pirates near Nigerian coast released - Sakshi

అబుజా: ప్రైవేటు బోటులో ప్రయాణిస్తున్న భారతీయులను గత నెలలో కిడ్నాప్‌ చేసిన  నైజీరియా సముద్ర దొంగ లు వారిని విడిచిపెట్టారు. డిసెంబర్‌ 15న ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట ఎమ్‌టీ డ్యూక్‌ పడవలో వెళుత ున్న 20 మందిని సముద్ర దొంగలు కిడ్నాప్‌ చేశారు. అయితే, ప్రయాణికుల్లోఒకరు మరణించారని నైజీరియాలోని భారత కార్యాలయం ఆదివారం తెలిపింది. మిగిలిన 19 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది. కిడ్నాప్‌ వార్త తెలిసిన వెంటనే స్పందించిన నైజీరియా ప్రభుత్వానికి ఆ దేశంలోని భారత అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top