స్పెయిన్లో జరిగిన 189 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు వాచీల చోరీ కేసులో 17 మందిని అరెస్ట్ చేశారు.
స్పెయిన్లో జరిగిన 189 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు వాచీల చోరీ కేసులో 17 మందిని అరెస్ట్ చేశారు. స్పెయిన్ చరిత్రలో ఇదే అతిపెద్ద బంగారు వస్తువుల దొంగతనమని పోలీసులు తెలిపారు.
అరెస్టయిన వారిలో 11 మంది చైనా జాతీయులున్నారు. గతేడాది చివర్లో దొంగలు మాడ్రిడ్లోని ఓ కంపెనీలోకి చొరబడి 1700 స్విస్ బ్రాండ్ వాచీలను దోచుకెళ్లారు. దొంగల నుంచి 300 విలువైన వాచీలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.