వైమానిక దాడిలో 15 మంది మృతి | 15 workers killed as Saudi-led airstrikes hit cement factory in Yemen | Sakshi
Sakshi News home page

వైమానిక దాడిలో 15 మంది మృతి

Feb 4 2016 9:20 AM | Updated on Sep 3 2017 4:57 PM

యెమన్ లో సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన దాడిలో కనీసం 15 మంది కార్మికులు మృతి చెందారు.

సనా: యెమన్ లో సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన దాడిలో కనీసం 15 మంది కార్మికులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. యెమెన్ ఉత్తర ప్రావిన్స్ లోని ఆమరాన్ లో సిమెంట్ కర్మాగారంపై బుధవారం ఈ వైమానిక దాడి జరిగింది. కర్మాగారం మెయిన్ గేటు వద్ద కార్మికులు జీతాలు తీసుకుంటుండగా ఈ దాడి జరిగిందని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారని 'జిన్హువా' వార్తా సంస్థ పేర్కొంది.
గాయపడిన వారిని ఆమరాన్ లోని ఆస్పత్రికి తరలించారని తెలిపింది.

కుటాఫ్ ప్రాంతంలోని ఆల్-జుబారా ట్రైబ్ లోని పలు గ్రామాలపై బుధవారం వైమానిక దాడులు జరిగాయి. సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన మూడు వైమానిక దాడుల్లో 40 మంది గ్రామస్థులు చనిపోవడం లేదా గాయపడడం జరిగిందని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement