గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్, ఎమ్మెల్యేలు | YSRCP mla's went to raj bhavan to complain again ap government | Sakshi
Sakshi News home page

గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్, ఎమ్మెల్యేలు

Mar 18 2016 11:00 AM | Updated on Aug 18 2018 5:15 PM

గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్, ఎమ్మెల్యేలు - Sakshi

గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్, ఎమ్మెల్యేలు

ఏపీ ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ వద్దకు వెళ్లారు.

హైదరాబాద్: ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేసేందుకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దాదాపు గంటకు పైగా బైఠాయించిన తర్వాత.. ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఫిర్యాదులు అందజేయడానికి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను సభలోకి రానివ్వకుండా మార్షల్స్ అడ్డుకోవడం, తదితర విషయాలను గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement