వారిపై అనర్హత వేటు తప్పదు : ధర్మాన | ysrcp leader dharamana speaks over party shifting mlas | Sakshi
Sakshi News home page

వారిపై అనర్హత వేటు తప్పదు : ధర్మాన

Apr 12 2016 2:15 PM | Updated on Mar 22 2019 6:25 PM

వారిపై అనర్హత వేటు తప్పదు : ధర్మాన - Sakshi

వారిపై అనర్హత వేటు తప్పదు : ధర్మాన

ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేందరిపై చట్టప్రకారం అనర్హత వేటు తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేందరిపై చట్టప్రకారం అనర్హత వేటు తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం 2003లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేసిన విషయాన్ని గుర్తుకు చేశారు. ఆ చట్టప్రకారం పార్టీ ఫిరాయించినా ఎమ్మెల్యేందరిపై చర్యలు తప్పవన్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థలో విద్యార్థుల డిపాజిట్లు రూ.740 కోట్లు ఉన్నాయని అలాంటి విద్యాసంస్థలను చైతన్య సంస్ధలకు అప్పగించడం సరికాదన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ధర్మాన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement