తెలుగు ప్రజలు వైఎస్ఆర్ని ఎప్పటికీ మరిచిపోరు | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలు వైఎస్ఆర్ని ఎప్పటికీ మరిచిపోరు

Published Tue, Sep 1 2015 12:49 PM

తెలుగు ప్రజలు వైఎస్ఆర్ని ఎప్పటికీ మరిచిపోరు - Sakshi

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో మేకపాటి రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ..  వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా బుధవారం ఉదయం 7.30 గంటలకు వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ మహానేత వర్దంతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రేపు పంజాగుట్ట సెంటర్లోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తామని మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు.
 

Advertisement
Advertisement