నగరంలోని శ్రీనగర్ కాలనీలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం
Dec 24 2016 10:47 AM | Updated on Aug 30 2018 4:10 PM
హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఆర్టీసీ బస్సు నుంచి దిగుతున్న ఓ యువకుడు జారిపడి ప్రాణాలు విడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్బీఐ క్వార్టర్స్ వద్ద వేగంగా వెళ్తున్న సిటీ బస్సు నుంచి రాజు అనే యువకుడు దిగడానికి ప్రయత్నించాడు. అదుపు తప్పి కిందపడిన అతని మీదుగా బస్సు చక్రం వెళ్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement