పొరుగింటివారు తిట్టారని.. | Woman commits suicide | Sakshi
Sakshi News home page

పొరుగింటివారు తిట్టారని..

Jun 13 2016 5:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఇంటి పక్కవారు అకారణంగా తిట్టారని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హయత్‌నగర్ మండలం కొత్తగూడలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్ : ఇంటి పక్కవారు అకారణంగా తిట్టారని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హయత్‌నగర్ మండలం కొత్తగూడలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుజాత(21)కు ఆదివారం పొరుగింటివారితో గొడవ జరిగింది. ఈ సందర్భంగా వారు అనవసరంగా దుర్భాషలాడారంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement