వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంత రోడ్ల పథకం కింద కేంద్రం మంజూరు
600 కి.మీ. మేర రూ.1,590 కోట్లతో నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొంతకాలంగా పరిశీలన పేరుతో పెండింగులో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి ఎట్టకేలకు ఓకే చెప్పింది. పాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 29 రోడ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. కొద్దిరోజుల క్రితమే సూత్రప్రాయ ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనుమతి మంజూరు చేసింది. 600 కిలోమీటర్ల మేర నిర్మితమయ్యే ఈ రోడ్లకు రూ.1,590 కోట్లు ఖర్చు కానున్నారుు. ముఖ్యంగా గోదావరి నదీ తీరం వెంబడి ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా రోడ్ల నిర్మాణం జరగనుంది.
ఇప్పటి వరకు అసలు రోడ్డంటూ లేకుండా కచ్చా బాటకే పరిమితమైన చోట్ల కూడా రెండు వరుసల రోడ్లు నిర్మితం కానుండటం విశేషం. అలాగే ప్రస్తుతం సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారులను కూడా రెండు వరుసలకు విస్తరిస్తారు. ప్రధాన రహదారులు, జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న వామపక్ష తీవ్రవాదుల కదలికలు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స నివేదికలు అందిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణరుుంచింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల డీజీపీల సదస్సులో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని వేగిరం చేయాలని కేంద్రం నిర్ణరుుంచటంతో రాష్ట్ర ప్రతిపాదనకు మోక్షం కలిగినట్టరుుంది.
రాష్ట్ర ప్రభుత్వంపై భారం
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పథకానికి ఇంతకాలం మొత్తం నిధులు కేంద్రమే విడుదల చేసేది. తాజాగా ఆ నిబంధనలు సడలించి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాలని తేల్చింది. దీంతో ఇప్పుడు కొత్తగా మంజూరైన రోడ్ల వ్యయంలో 40 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడబోతోంది. దాదాపు రూ.630 కోట్ల మేర రాష్ట్ర ఖజానాపై భారం పడనుంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు వరుసల రోడ్లు
Published Wed, Jan 11 2017 12:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement