నేడు ‘హోదా’పై జన చైతన్య వేదిక సమావేశం | Today Jana Chaitanya Vedika meeting on status | Sakshi
Sakshi News home page

నేడు ‘హోదా’పై జన చైతన్య వేదిక సమావేశం

Feb 5 2017 1:38 AM | Updated on Mar 23 2019 9:10 PM

జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక హోదాపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు.

పాల్గొననున్న రాజకీయ, పాత్రికేయ ప్రముఖులు

సాక్షి, హైదరాబాద్‌: జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక హోదాపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ‘విభజన చట్టం – ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ’ అనే అంశంపై చర్చించనున్నారు.

జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కె.పార్థసారధి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు, తెలకపల్లి రవి, కాంగ్రెస్‌ నేత ఎన్‌.తులసిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement