‘మెట్రో’ స్థలం మార్చలేదు | there is no changes occurs on metro place | Sakshi
Sakshi News home page

‘మెట్రో’ స్థలం మార్చలేదు

Sep 21 2014 3:11 AM | Updated on Sep 4 2018 5:15 PM

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గతంలో కేటాయించిన 15 ఎకరాల స్థలాన్ని మార్చలేదని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) స్పష్టం చేసింది.

ఆక్వా స్పేస్ డెవలపర్స్‌కు అనుకూలంగా వ్యవహరించలేదు: టీఎస్‌ఐఐసీ

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గతంలో కేటాయించిన 15 ఎకరాల స్థలాన్ని మార్చలేదని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) స్పష్టం చేసింది. ఆక్వా స్పేస్ డెవలపర్స్ కోసం ఎటువంటి ఆశ్రీత పక్షపాతం చూపలేదని పేర్కొంది. ఈ మేరకు టీఎస్‌ఐఐసీ వీసీ, ఎండీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2007లో రూ. 580.50 కోట్లను చెల్లించి రాయదుర్గంలోని ఏపీఐఐసీ భూమిని డీఎల్‌ఎఫ్ (ప్రస్తుతం ఆక్వా స్పేస్ డెవలపర్స్) కొనుగోలు చేసిందని అందులో పేర్కొన్నారు.

ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ అయిందని తెలిపారు. అయితే ఆ భూమిలో వారసత్వ సంపద (పురాతన శిలా ఫలకాలు) ఉన్నందున ప్రత్యామ్నాయ స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించామని తెలిపారు. అదేవిధంగా వేలంలో కొన్న భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 2.90 కోట్లను, రూ. 31.92 కోట్ల స్టాంపు డ్యూటీని 2013 సెప్టెంబర్‌లోనే ఆ సంస్థ చెల్లించిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. మొత్తంగా ఏడేళ్ల తర్వాత 2014 ఆగస్ట్‌లో ఆ సంస్థతో ఎక్స్ఛేంజ్ డీడ్ కుదుర్చుకున్నామన్నారు. సంస్థ పేరు మార్పునకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) కూడా అంగీకరించిందని.. పేరు మార్పు పూర్తిగా చట్టపరమైనదని, ఇందులో ఎటువంటి తప్పు లేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement