- న్యూస్ వ్యూస్ కాకూడదు
- ఉర్దూ జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం సమావేశ మందిరంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉర్దూ జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో సిటిజన్ ఫస్ట్, మీడియా సెకండ్ అని ఆయన అభివర్ణించారు. కళలకు హద్దులుండవని, కానీ దేశానికి సరిహద్దులుంటాయని, ప్రయోజనాలకు విరుద్ధంగా మీడియా స్వేచ్ఛ ఉండకూడదన్నారు. సమాజంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా వార్తా ప్రసారాలు చేయొద్దని, పరిమితులు దాటితే నిబంధలనకు లోబడి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
న్యూస్ వ్యూస్ కాకూడదని, వార్తలను వార్తల్లాగానే ప్రసారం చేయాలి తప్ప సొంత అభిప్రాయాలను జోడించవద్దని, అవసరమైతే తమ వ్యూస్లకు ఎడిటోరియల్ పేజీలను ఉపయోగించుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సినిమా యాక్టర్ల మాదిరిగా తళుక్కుమని మెరిసి వెళ్లిపోతుందని, ప్రింట్ మీడియా గృహిణిలాంటిదన్నారు. ఉర్దూ మధురమైనదని, మాతృభాష ఉర్దూకు ముస్లింలు దూరంగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉర్దూ మీడియా ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటామని, ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉర్దూ జర్నలిస్టులకు శిక్షణ ఇస్తామన్నారు. దూరదర్శన్లో ఉర్దూ వార్తల నిడివిని పెంచుతామని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర కీలకం: మహమూద్ అలీ
తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, 5 లక్షల ప్రమాదబీమా కల్పించామని ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలి పారు. డెస్క్ జర్నలిస్టులతో పాటు మండలం, జిల్లాల్లోని ప్రతీ జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఐజేయూ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కమిషనర్ అబీద్ రసూల్ఖాన్, ఉర్దూ అకాడమీ కార్యదర్శి షుకూర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు అమర్నాథ్, ఐజేయూ ఎం.ఎ మాజీద్, టీఎస్యూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరహత్ అలీ, సభ్యులు వరకాల యాదగిరి, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉంది
Published Mon, Nov 7 2016 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement