రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు | temperature rises in Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

Dec 17 2016 5:34 AM | Updated on Sep 4 2017 10:53 PM

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

ఇటీవల తుపాను కారణంగా ఇంకా మేఘాలు ఆవరించి ఉండటంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు కాస్తంత పెరిగాయి. ఇటీవల తుపాను కారణంగా రాష్ట్రంపై ఇంకా మేఘాలు ఆవరించి ఉండటంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు, రాత్రి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌లలో 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్, హన్మకొండ, భద్రాచలం, నల్లగొండ, రామగుండంలలో 31 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ మినహా ఇతర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 10 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదుకావడం గమనార్హం. హైదరాబాద్‌లో 20 డిగ్రీలు, నల్లగొండలో 23 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement