నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని

నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని - Sakshi


తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఇప్పటికి 38 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలు ఖరారు చేసినట్లు తెలిపారు. మరో మూడు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. నోముల నర్సింహయ్య పార్టీ వీడడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.


 


నోముల సీపీఎం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తమ్మినేని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.  తమ పార్టీ అభివృద్ధి ప్రణాళిక ఈ నెల13 లేదా 14న ప్రకటిస్తామన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం నోముల నర్సింహయ్య తీసుకున్న సంగతి తెలిసిందే.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top