తన శాఖ మార్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శుక్రవారం హైదరాబాద్లో నిరాకరించారు.
హైదరాబాద్ : తన శాఖ మార్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శుక్రవారం హైదరాబాద్లో నిరాకరించారు. మర్రి శశిధర్రెడ్డివి గాలి మాటలు అని ఆయన అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యాలపై తాను స్పందించను అని తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. వెటర్నరీ శాఖలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు.