'జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా లేదు' | t-ysrcp leader sivakumar speaks over new districts formation | Sakshi
Sakshi News home page

'జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా లేదు'

Sep 18 2016 3:07 PM | Updated on Oct 17 2018 3:38 PM

'జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా లేదు' - Sakshi

'జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా లేదు'

జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగడం లేదని వైఎస్సార్సీపీ నేత శివకుమార్ ఆరోపించారు.

హైదరాబాద్ : ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జిల్లాల విభజన చేయాలని తెలంగాణ వైఎస్సార్సీపీ నేత శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ను జిల్లా కేంద్రం చేయాలంటూ వివిధ పార్టీల నేతలను ఆదివారం అఖిలపక్ష నేతలు కలిశారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు.    
 
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ...జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగడం లేదన్నారు. ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మార్పులు చేసిన తర్వాత మరోసారి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement