హైదరాబాద్: వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళల పునరావాసానికి కృషిచేస్తున్న ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునీత కృష్ణన్ కారుపై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో ఆమె అందులో లేరు. చార్మినార్ సమీపంలోని సంస్థ కార్యాలయం సమీపంలో కారు పార్క్ చేసి ఉండగా ఈ ఘటన జరిగింది. సునీత కృష్ణన్ కారుపై దాడి జరగడం, మూడు రోజులుగా ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తుండడంపై జాతీయ మీడియాలోనూ కథనాలు రావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.
ఓ జాతీయ చానెల్కు ఆమె ఇంటర్వూ ఇచ్చిన కొద్దిసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఓ గ్యాంగ్రేప్నకు సంబంధించి నిందితుల వీడియోను ఆమె సోషల్ మీడియాలో పెట్టడం వల్లే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 6 నెలల క్రితం ఉత్తరాది రాష్ట్రంలో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన వీడియో వాట్సాప్ ద్వారా సునీత కృష్ణన్కు చేరింది. ఆ యువకులు మాత్రమే కనిపించే విధంగా ఆమె ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టారు. ఆ దుశ్చర్యపై ప్రజల్లో భారీ స్పందన వచ్చింది. దీంతో శుక్రవారం ఉదయమే సునీత కృష్ణన్ను ఓ జాతీయ చానల్ ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేసింది. ఆ తర్వాత గంట సేపటికే ఆమె కారును దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఈ ఘటనపై ఆరా తీశారు. మరోవైపు శుక్రవారం సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు చార్మినార్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
సునీత కృష్ణన్ ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తునకు రెండు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజ్వల కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, మూడు రోజులుగా తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సునీత కృష్ణన్ మీడియాకు వెల్లడించారు. లైంగికదాడి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. లైంగికదాడుల నిరోధానికి ప్రత్యేక చట్టాలు తేవాలన్నారు. తాజా ఘటనపై హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
సునీత కృష్ణన్ కారుపై దాడి
Published Sat, Feb 7 2015 7:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement